ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలేజికి వెళ్లమన్నందుకు విద్యార్థి ఆత్మహత్య

Crime |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 10:27 PM

కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడిపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి పట్టణంలోని అంబాభవాని వీధికి చెందిన రంగయ్య, అమరావతిలకు హర్షత్‌సాయి అనే కుమారుడు ఉన్నాడు. హర్షత్ సాయి విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఉగాది సెలవుల కోసం హర్షత్‌సాయి ఇటీవల ఇంటికి వచ్చాడు. పండగ సెలవులు పూర్తైన తర్వాత కూడా హర్షత్ సాయి కాలేజీకి వెళ్లనని మారాం చేశాడు. అయితే అతని తల్లి బలవంతంగా అతన్ని విజయవాడ పంపించారు. ఏప్రిల్ 2న రాత్రి విజయవాడకు పంపించారు. అయితే హర్షత్ సాయి కళాశాలకు వెళ్లకుండా శుక్రవారం ఉదయానికల్లా తిరిగి ఇంటికి వచ్చేశాడు. దీంతో హర్షత్ సాయి తల్లి కోపంతో అతన్ని మందలించింది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం హర్షత్ సాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హర్షత్ సాయి తండ్రి రంగయ్య దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. రంగయ్య పెద్దకుమారుడు ఆదిత్య కన్యాకుమారిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చిన్న కొడుకు హర్షత్ సాయి విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే బుద్ధిగా చదువుకోవాలని తల్లి మందలించగా.. క్షణికావేశంలో హర్షత్ సాయి ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com