ప్రస్తుత సమాజంలో రోజుకో కొత్త తరహా మోసాలు, నేరాలు వెలుగుచూస్తున్నాయి. తెల్లారి పేపర్ చూస్తే ముక్కున వేలేసేకునేలా అనేక ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి, ఇద్దరు మహిళల మధ్య వివాహేతర సంబంధం.. పగలా మారి ఓ నిండు ప్రాణం తీసింది. ఓ కుటుంబంలో విషాదం నింపింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో జరిగిన ఈ ఘటన.. ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులకు అద్దం పట్టడమే కాకుండా.. ఓ కొత్త గుణపాఠం నేర్పుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలానికి ఓ 23 ఏళ్ల యువతికి.. అదే ఊరికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఈ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అతనికి సెల్ఫీ వీడియోలు పంపించేది ఆ యువతి. మామూలు వీడియోలతో పాటుగా అతని ఆనందం కోసం న్యూ్డ్ వీడియోలను కూడా షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇది తన ప్రాణాన్ని తీస్తుందని అప్పట్లో ఆ యువతి ఊహించలేకపోయింది. ఇక ఈ యువతితో యవ్వారం సాగిస్తున్న ఆ వ్యక్తి.. మరో మహిళలతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం యువతికి తెలియడంతో.. ఆ యువతికి, మహిళకు మధ్య అతగాడి కోసం గొడవలు ప్రారంభమయ్యాయి.
అయితే ఏప్రిల్ 8వ తేదీన ఆ యువతి ఆరోగ్యం ఉన్నట్లుండి క్షీణించింది. ఏమైందా అని కుటుంబసభ్యులు ఆరా తీస్తే.. ఎలుకల మందు తాగిన విషయం తెలిసింది. దీంతో కుటంబసభ్యులు ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. యువతి చనిపోయిన తర్వాత ఎలుకల మందు ఎందుకు తాగిందనే విషయం బయటకు వచ్చింది. యువతితో గొడవల నేపథ్యంలో.. ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తున్న మహిళే.. అతని సెల్ఫోన్లోని న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ యువతి అవమానం భరించలేక, మనస్తాపానికి గురై ఆత్యహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
![]() |
![]() |