విశాఖపట్నం పాతగంగవరం బీచ్లో విద్యార్థి గల్లంతైన సంగతి తెలిసిందే. 9వ తరగతి చదువుతున్న తనూష్ అనే విద్యా్ర్థి గురువారం సాయంత్రం గల్లంతయ్యాడు. తనూష్ ఆచూకీ కోసం న్యూపోర్టు పోలీసులు గాలిస్తున్నారు. నేవీ హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యారాడ నుంచి పాతగంగవరం, వాడ చీపురుపల్లి తీరాల మీదుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విద్యార్థి ఆచూకీ తెలియడం లేదు. దీంతో బాలుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పాతగంగవరం సముద్ర తీరంలోనే నిరీక్షిస్తూ ఉంది. మరోవైపు బాలుడు సముద్రంలో రాళ్ల మధ్యలో చిక్కుకున్నాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
![]() |
![]() |