కూటమి పాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాజరికంలో ఉన్నామా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అయన మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యాన్ని, విలువలను అపహాస్యం చేసేలా మేయర్ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ జరిగింది. మా పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభపెట్టి ఓటేయించుకున్నారు. రాజకీయంగా వాళ్లకు వాళ్లే సమాధి కట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఎదుట పార్టీ నాయకులను తీసుకోబోమని చెప్పి, కేవలం 10 నెలల మేయర్ పీఠం కోసం మా కార్పొరేటర్లను పెట్టని ఇబ్బంది లేదు. దమ్ము ధైర్యం ఉంటే మా పార్టీ నుంచి తీసుకున్న 27 మంది కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తుల మీద గెలిపించి, మేయర్ పదవిని దక్కించుకోవాలి. బీసీ మహిళను దించిన పార్టీలుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన చరిత్రలో మిగిలిపోతాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై వైయస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుంది అని తెలిపారు.
![]() |
![]() |