రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాం.. ఈ రోజు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
16 వేల 347 డీఎస్సీ పోస్టులతో నేడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.. నేటి నుంచి ఆన్ లైన్లో డీఎస్సీ అభ్యర్థులు అప్లైయ్ చేసుకోవచ్చు అని సూచించారు. ఇక, డీఎస్సీ అభ్యర్థులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని లోకేష్ పేర్కొన్నారు.
![]() |
![]() |