ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో మే 10న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ను జూలై 5వ తేదీకి వాయిదా వేసినట్లు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు.
ఈ మార్పును కక్షిదారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, బ్యాంకు, బీమా, పోలీసు శాఖల అధికారులు గమనించవలసిందిగా ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
![]() |
![]() |