ముంబయి ఇండియన్స్ జట్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబయి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్లో ముంబయి జట్టుకు ఇది 150వ గెలుపు కావడం విశేషం. టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి టీమ్గా ముంబయి రికార్డుల్లోకి ఎక్కింది.ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల విషయానికి వస్తే ముంబయి ఇండియన్స్ 150 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, 140 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో, ఆ తర్వాత స్థానాల్లో కోల్కతా నైట్ రైడర్స్ (134), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (129), ఢిల్లీ క్యాపిటల్స్ (112) జట్లు నిలిచాయి.ఇక, ఈ సీజన్ను పేలవమైన ప్రదర్శనతో ప్రారంభించిన ఎంఐ ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి ఐదు మ్యాచ్ల్లో ఒక్క గెలుపుతో అభిమానులను నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పుడు వరుసగా ఐదో గెలుపు తన ఖాతాలో వేసుకుంది.
![]() |
![]() |