తెనాలి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.27.70 కోట్లతో ప్లాట్ఫారంల అభివృద్ధి, మూడవ వంతెన, ఎస్కలేటర్లు, లిఫ్టులు, అధునాతన టాయిలెట్లు, ఏసీ వెయిటింగ్ హాలు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఢిల్లీ, హౌరా-చెన్నై మార్గంలో ప్రధానమైన తెనాలి రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 160 రైళ్లు ప్రయాణిస్తున్నాయి. 88 రైళ్లు ఆగే ఈ స్టేషన్ నుంచి రోజు 17 వేల మంది ప్రయాణిస్తుండగా టిక్కెట్ల ఆదాయంపైనే రోజు రూ.3 లక్షలు వస్తాయి.పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండవ ప్లాట్ఫారం మెయిన్ లైనుగా మార్చుతున్నారు. మలుపుల కారణంగా 140 కి.మీ వేగంతో వెళ్లాల్సిన రైళ్లు 90 కి.మీ వేగంతో వెళుతున్నాయి. ఈ కారణంగా ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఇందుకోసం వేగం పెంచేందుకు రెండవ ప్లాట్ఫా రం మెయిన్లైన్గా మార్చి అభివృద్ధి చేస్తున్నారు.
![]() |
![]() |