ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ పై భారత్ తీవ్ర ఒత్తిడి తీసుకురావాలన్న సుబ్రహ్మణ్యస్వామి

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 08:46 PM

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘాతుకానికి పాల్పడిన దోషులను తక్షణమే భారత్‌కు అప్పగించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.పహల్గామ్‌లో చోటుచేసుకున్న అత్యంత హేయమైన సంఘటనను గుర్తుచేస్తూ, 26 మంది హిందూ పర్యాటకులను వారి భార్యల కళ్లెదుటే అత్యంత కిరాతకంగా హతమార్చారని స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని 'నరహంతకులు'గా అభివర్ణించిన స్వామి, వారిని భారతీయ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చి, కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే, దోషులను భారత్‌కు అప్పగించడం తప్పనిసరి అని ఆయన నొక్కి చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa