ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమందేపల్లి ప్రాథమిక వైద్యశాలలో నూతన వైద్యాధికారిణిగా అయిషా తశ్నీం బాధ్యతలు స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 04:35 PM

సోమందేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన రెండవ వైద్యాధికారిణిగా డాక్టర్ సి.ఎం. అయిషా తశ్నీం సోమవారం తన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హిందూపురం అర్బన్ హెల్త్ సెంటర్‌లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద వైద్యాధికారిగా పనిచేస్తున్న ఆమె, తాజాగా రెగ్యులర్ బదిలీపై సోమందేపల్లికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆమెకు ఘనస్వాగతం పలికారు. వైద్య సేవల అందుబాటులో మరింత అభివృద్ధి సాధించేలా పని చేస్తానని డాక్టర్ అయిషా తశ్నీం ఈ సందర్భంగా తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com