ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధంలో గెలిచినా పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేరు..: సీఎం హిమంత బిశ్వ శర్మ

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 07:55 PM

పహల్గాం ఉగ్రదాకి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశంపై విరుచుపడగా.. పాక్ సైతం ప్రతిదాడులు చేసింది. అయితే 18 రోజుల పాటు జరిగిన ఈ సైనిక దాడులకు ఇరు దేశాలు ఉద్వాసన పలుకుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో ప్రతిపక్షాలు అన్నీ పీఓకేను స్వాధీనం చేసుకుంటే బాగుండు, ఎందుకు బీజేపీ వెనకడుగు వేసిందంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. బీజేపీ సర్కారును కాంగ్రెస్ ప్రశ్నించే స్థాయిలో లేదని అన్నారు. 1971లో పాక్‌తో యుద్ధం చేసిన భారత్ ఎందుకు పీఓకేను స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని అన్నారు. అప్పుడు పదవిలో ఉన్నది కాంగ్రెస్ సర్కారేనని గుర్తు చేశారు.


పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దౌత్యపరంగా, వైమానిక దాడులు చేస్తూ చుక్కలు చూపించింది. పాక్ సైతం ఎదురు దాడులకు పాల్పడినా.. 18 రోజుల తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే గెలిచే అవకాశం ఎక్కువగా ఉండగా.. భారత్ ఎందుకు వెనకడుగు వేసిందని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే.. పీఓకేను స్వాధీనం చేసుకుంటే బాగుండేదని చెబుతుంది. అలాగే పదే పదే మోదీ సర్కారుపై.. పాక్‌తో కాల్పుల విరమణ అంశంపై ప్రశ్నలు గుప్పిస్తోంది. అయితే తాజాగా వీటిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు.


కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీ సర్కారును ప్రశ్నించే హక్కే లేదని గుహవటిలో జరిగిన ఓ మీడియా సమావేశంలో అన్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ అఖండ విజయం సాధించిందని గుర్తు చేశారు. అయితే అప్పుడు కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉండగా.. ఎందుకు పీఓకేను స్వాధీనం చేసుకోలేదో చెప్పాలని అన్నారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారతదేశానికి కలిపే "చికెన్ నెక్"ను ఎందుకు విస్తరింపజేయలేదో కూడా వెల్లడించాలని కోరారు. అది సరైన సమయమే అయినప్పటికీ కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తగ్గిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ముఖ్యంగా అప్పడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ ఈ పనులు ఎందుకు చేయలేకపోయారో కాంగ్రెస్ వివరించాలన్నారు. ఆమె ఇప్పటికీ బతికే ఉంటే తాను కచ్చితంగా ఈ ప్రశ్నలు అడిగి ఉండేవాడినని చెప్పారు.


అప్పుడే ఆయా ప్రాంతాలను అధీనంలోకి తీసుకుని ఉంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవి కాదని సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. అలాగే తాజాగా జరిగిన కాల్పుల విరమణ గురించి మాట్లాడుతూ.. పలహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పేందుకు బీజేపీ సర్కారు గట్టి చర్యలు తీసుకుందన్నారు. కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వివరించారు. ఆ లక్ష్యం పూర్తి అయింది కాబట్టే పాక్‌తో కాల్పుల విరమణకు భారత్ ఓకే చెప్పిందన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినందుకు పాక్ సైన్యానికి కూడా తగిన శాస్తి జరిగిందని.. భారత్‌తో గెలవలేకే పాక్ కాళ్లబేరానికి వచ్చిందని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com