ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరేబియన్ దేశంలో మరో భారత సంతతి విద్యార్థి మృతి

Crime |  Suryaa Desk  | Published : Wed, May 14, 2025, 08:58 PM

భారత సంతతికి చెందిన ఓ కళాశాల విద్యార్థిని ఇటీవలే కరేబియన్ దేశానికి వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. బీచ్‌లో తప్పిపోయిన ఆమె మృతదేహం కూడా లభ్యం కాలేదు. కానీ ఆమె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులే ధ్రువీకరించారు. ఈ ఘటన జరిగి కొన్ని నెలల కూడా కాకముందే అదే దేశంలో భారత సంతతికి చెందిన మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయాడు. మరికొద్ది రోజుల్లోనే గ్రాడ్యుయేషన్ కూడా ఉందనగా.. స్నేహితులతో కలిసి కరేబియన్ వెళ్లాడు. అక్కడే ఓ హోటల్‌లో బస చేస్తుండగా.. ప్రమాదవశాత్తు హోటల్ బాల్కనీ నుంచి పడిపోయి చనిపోయాడు.


అమెరికాలోని భారత సంతతికి చెందిన 25 ఏళ్ల గౌరవ్ జైసింగ్ అనే విద్యార్థి మాసాచుసెట్స్‌లోని వాల్తామ్‌లోని బెంట్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు. ఈ వారంలోనే అతడి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాబోతుంది. ముఖ్యంగా మే 17వ తేదీ రోజే గ్రాడ్యుయేట్ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎలాగు చదువు అయిపోయిందని కదా అని స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి వెళ్లాడు. మే 11వ తేదీన అక్కడి బహమాస్ ప్రాంతానికి వెళ్లి ఓ హోటల్‌లో బస చేశారు. స్థానికంగా ఉండే ప్రాంతాలన్నీ తిరిగొచ్చి ఫుల్లుజా ఎంజాయ్ చేశారు.


ఆపై అంతా కలిసి మళ్లీ హోటల్‌కు చేరుకున్నారు. ముఖ్యంగా రాత్రి 10 గంటల సమయంలో స్నేహితులంతా కలిసి బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే గౌవర్ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం గుర్తించిన స్నేహితులు వెంటనే అతడి వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాట్లాడకపోవడంతో భయపడి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించగా.. గౌరవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇలా అతడి మృతదేహాన్ని అమెరికా తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.


గౌవర్ మృతిపై బెంట్లీ వర్సిటీ ఎక్స్ వేదికగా సంతావం వ్యక్తం చేసింది. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రియమైన వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వివరించింది. ప్రమాదవశాత్తే అతడు ప్రాణాలు కోల్పోయాడని.. కానీ గౌరవ్ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ మిగతా వివరాలను చెప్పడం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి కరేబియన్ దేశానికి విహార యాత్ర కోసం వెళ్లి.. అక్కడే అదృశ్యం అయింది. ఆమె ఏ బీచ్ వద్ద అయితే కనిపించకుండా పోయిందో.. అదే బీచ్ వద్ద ఆమె చెప్పులు, బట్టలను పోలీసు అధికారులు గుర్తించారు. ఆపై ప్రమాదం జరిగిన రోజు ఆమె తన ప్రియుడితో ఉండడాన్ని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నీళ్లలో కొట్టుకుపోయే చనిపోయినట్లు చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com