జమ్మలమడుగులో నారాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల పరంపరలో భాగంగా మే 18న జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు గురువారం వెల్లడించారు.
ఈ పోటీలు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరియు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మే 18వ తేదీ ఉదయం 7:30 గంటలకు న్యూ కేటగిరిలో పోటీలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత మే 19వ తేదీ ఉదయం సీనియర్ విభాగంలో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అన్ని వయస్సులవారు పాల్గొనగల ఈ పోటీలు, బ్రహ్మోత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని వారు పేర్కొన్నారు.
![]() |
![]() |