ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ యువకుడు

international |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 08:20 PM

 అమెరికాలో జరిగిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా షాపులోకి కస్టమర్‌లా ప్రవేశించిన ఓ దుండగుడు.. కౌంటర్ వద్ద ఉన్న గుజరాత్ వ్యక్తితో మాట కలిపాడు. ముందుగా బాగానే మాట్లాడినా.. తుపాకీ చూపించి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. భయపడ్డ భారతీయుడు గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు అన్నీ తీసి ఇచ్చేశాడు. అవన్నీ తీసుకున్న తర్వాత దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. డబ్బులు దోచుకునేందుకు వచ్చిన దుండగుడు తుపాకీ చూపించి బెదిరించి దోచుకున్నాడు. అనంతరం కాల్పులు జరిపాడు. గుజరాత్ రాష్ట్రం డింగుచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి అమెరికాలోని ఓ షాపులో పని చేస్తున్నారు. ఎప్పట్లాగే షాపుకు వెళ్లి అతడు తన డ్యూటీలో భాగంగా కౌంటర్ వద్ద పని చేస్తున్నాడు. ఆ షాపులోకి ప్రవేశించాడు దుండగుడు. కస్టమర్‌లా షాపులో తిరుగుతూ అన్నీ పరిశీలించాడు.


కాగా ఆ షాపులో ఎవరూ లేకపోవడంతో క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పరేష్ పటేల్ వద్దకు దుండగుడు వచ్చాడు. గన్ గురిపెట్టి పరేష్‌ను బెదిరించాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గన్ చూసి భయపడ్డ పరేష్ పటేల్ అతడు చెప్పినట్లు చేశాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బు దోచుకున్న తర్వాత ఆ వ్యక్తి పరేష్ పటేల్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు.


బుల్లెట్ గాయంతో తీవ్ర రక్తస్రావమైన పరేష్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇదంతా రికార్డు అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా పరేష్ చనిపోయిన విషయం తెలుసుకున్న అమెరికా పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన మే 21న జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com