గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత విషాదకరమని, ఊహించలేనిదని ఆయన గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు., అహ్మదాబాద్ నుంచి 242 మందితో లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విమానం సమీపంలోని వైద్య కళాశాల వసతిగృహ భవనాలపై కూలిపోవడం పెను విషాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం. 242 మందితో లండన్ బయలుదేరిన విమానంటేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాం. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఇది ఒక మహా విషాదంగా మిగిలింది" అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa