సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 టైటిల్ను సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు: చేసుకున్నారు. బెంగళూరు అయితే విజయోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ క్రమంలో జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం పాలవగా, 50 మందికి పైగా గాయపడ్డారు. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి వేలాది మంది ప్రజలు స్టేడియం వద్ద గుమిగూడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే కర్ణాటక పోలీసులు.. కర్ణాటక క్రికెట్ బోర్డు, ఆర్సీబీ సహా నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుగుతోంది. ఈ దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జట్లు వేడుకలు నిర్వహించుకునే వేళ పాటించాల్సిన కొత్త నియమ, నిబంధనల విషయంపై చర్చించడానికి జూన్ 14న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బోర్డు కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
తొక్కిసలాటపైనే కాకుండా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో.. దేశవాళీ క్రికెట్ షెడ్యూల్, అంతర్జాతీయ సిరీస్ల వేదికల ఖరారు, ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ సమీక్ష, కోడ్ ఆఫ్ కండక్ట్ వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. 2026 జనవరిలో భారత్, న్యూజిలాండ్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ సిరీస్ ఖరారు అయింది. ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఖరారు చేయనుంది. ఇక, 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్కు సంబంధించిన పూర్తి క్యాలెండర్ను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్ల తేదీలు, వేదికలను ఈ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు.
క్రికెట్ అన్ని స్థాయిలలో వృత్తిపరమైన, నైతిక ప్రవర్తనను నిర్ధారించడానికి ప్రస్తుతం ఉన్న కోడ్ను సమీక్షించి, అవసరమైతే సవరించనున్నారు. ఇక ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ను కూడా సమీక్షించేందుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సిద్ధంగా ఉంది. అండర్-16 (బాలురు), అండర్-15 (బాలికలు) విభాగాల్లో వయసు మోసాలను అరికట్టడానికి ఈ రూల్స్ చాలా కీలకం. వయసు మోసాలపై బీసీసీఐ జీరో టాలరెన్స్ వైఖరిని అవలంబిస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa