ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కోసం తరలివచ్చే ప్రజా ఉప్పెనని మీరు ఆపలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 09:25 AM

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుంద‌ని, వైయ‌స్‌ జగన్ చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు అడుగ‌డుగునా ఆంక్ష‌లు విధించ‌డం దుర్మార్గ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు.  గుంటూరులోని త‌న క్యాంపు కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..ఇంకా ఆయనేమన్నారంటే... చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల పరామర్శకు వస్తున్న వైయస్ జగన్ సమావేశానికి హాజరవుతున్న రైతులపై ప్రభుత్వం అడుగడునా ఆంక్షలు విధిస్తున్నారు. వైయస్ జగన్ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి ప్రభుత్వం సుమారు మూడువేల మందికి నోటీసులు ఇప్పించింది. చివరకు పెట్రోల్ బంకు దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టి ఎవరికీ పెట్రోల్ కూడా అమ్మడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టడం దారుణం. అనేక మంది నాయకులను అరెస్టు చేశారు, చాలా మందిని గృహ నిర్భందంలో పెట్టారు. ఇక వైయస్ జగన్ హెలీ ప్యాడ్ వద్ద లాఠీ ఛార్జీ కూడా చేశారు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa