ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదుల అనుసంధానం చేసిన అపర భగీరథుడు చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 10:15 AM

కరువు రహిత రాష్ట్రంగా ఏపీనీ తీర్చిదిద్దాలి. అదే సీఎం చంద్రబాబు లక్ష్యం. దేశంలోనే తొలి సారిగా రాష్ట్రంలో గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు ఆయన’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద పట్టిసీమ ద్వారా పోలవరం కాలువలో వచ్చి కృష్ణా నదిలో కలిసిన గోదావరి జలాలకు ఆయన జలహారతులిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘జాతి సంపదైన శ్రీశైలాన్ని కాపాడుకోవాలి. పట్టిసీమ ద్వారా గోదావరిలో కలిసే వరద జలాలను కృష్ణాలో కలిపి డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ఏడాది జూలైలో అర టీఎమ్‌సీ సాగునీరు నిల్వ ఉంటే ఈ ఏడాది అదే జూలైలో 20 టీఎమ్‌సీల నీరు నిల్వ ఉంది. వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. వైసీపీ హాయాంలో పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు తుడిచి పెట్టుకుపోయింది. 20 గ్రామాలను వరద ముంచెత్తింది. 42 మంది మరణానికి కారణమైంది. పట్టిసీమతో పాటు రాష్ట్రంలోని 1,040 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో సగం మూతపడేలా చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా చేసింది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa