అనంతపురం జిల్లాలోని గుంతకల్లు , గుత్తి రైల్వే జంక్షన్లలో రైలు ప్రయాణికుల కోసం అత్యాధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. రైలు ప్రయాణికులను ఎక్కువగా ఇబ్బందికి గురిచేసే అంశాలు.. రైలు టైమింగ్స్.. ఫలానా సమయానికి రైలు బయల్దేరుతుందని.. లేదా వస్తుందని అనుకుంటే.. గంట అటో ఇటో కాక తప్పదు. దీంతో రైల్వేస్టేషన్లలో రైళ్ల కోసం ప్రయాణికులకు నిరీక్షణ తప్పదు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా.. రైల్వేస్టేషన్ల గుండా సకాలంలో రైళ్లు బయలుదేరేలా
రూ.47 కోట్లతో చేపట్టే పనులు పూర్తి అయితే.. గుంతకల్లు, గుత్తిలలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. గుంతకల్లు జంక్షన్లో ప్రస్తుతం మూడు సిగ్నలింగ్ క్యాబిన్లు ఉన్నాయి. అయితే వీటిని తొలగించి అన్నింటినీ ఒకేచోట అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ క్యాబిన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేకంగా సిగ్నలింగ్ క్యాబిన్ నిర్మించారు.
ఈ అధునాతన సిగ్నలింగ్ క్యాబిన్ అందుబాటులోకి వస్తే.. సిగ్నల్స్ కంప్యూటర్ ద్వారా పనిచేస్తాయి. దీంతో రైళ్లు డేంజర్ సిగ్నళ్లు దాటడం వంటి ఘటనలకు ఆస్కారం ఉండదు. అలాగే రైలు ప్రమాదాలను కూడా నివారించవచ్చని అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గుంతకల్లు రైల్వేస్టేషన్లో యార్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే తప్ప.. సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేయలేమని అధికారులు చెప్తున్నారు. దీంతో అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ క్యాబిన్ అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa