ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటవీ ప్రాంతంలో 30 కింగ్‌కోబ్రా పిల్లలను విడిచిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 10:55 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు రెవెన్యూ పరిధిలోని శంకరం అటవీ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు ఆదివారం 30 కింగ్‌కోబ్రా పిల్లలను విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలో నెల రోజుల కిందట 30 కింగ్‌కోబ్రా గుడ్లను అటవీ శాఖాధికారులు, వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ కో ఆర్డినేటర్‌ మూర్తి గుర్తించారు. ఆ గుడ్లకు రక్షణగా నెట్‌ ఏర్పాటు చేశారు. నెల రోజుల తర్వాత ఆ 30 గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడంతో.. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అంతరించిపోతున్న జాతుల్లో కింగ్‌ కోబ్రా ఒకటని, వాటి రక్షణకు కృషిచేస్తున్నామని అటవీ శాఖ అధికారులు శాంతిప్రియ, దివాన్‌ మొహిద్దీన్‌ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa