పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులను భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ మహాదేవ్' ద్వారా హతమార్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో అధికారికంగా ప్రకటించారు. మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, ఉగ్రవాదానికి తావు ఇవ్వమని స్పష్టం చేశారు.
ఈ ప్రకటన 'ఆపరేషన్ సిందూర్'పై జరిగిన చర్చ సందర్భంలో వెలువడింది. అమిత్షా తెలిపిన వివరాల ప్రకారం, పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎం-9, రెండు ఏకే-47 తుపాకులు ఉపయోగించారు. అనంతరం మూడు నెలల పాటు వారు సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ అనే నకిలీ పేర్లతో విభిన్న ప్రాంతాల్లో దాక్కున్నారు.
భద్రతా దళాల నిఘా, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన 'ఆపరేషన్ మహాదేవ్' విజయవంతమై ఈ ముగ్గురు ముష్కరులను ఖతం చేసింది. ఈ విజయంతో దేశ భద్రతా వ్యవస్థ మళ్ళీ ప్రజల్లో విశ్వాసాన్ని పుంజుకుంది. అమిత్షా మాట్లాడుతూ, ఇటువంటి చర్యలు ఉగ్రవాదం పై దేశం కట్టుదిట్టంగా నిలబడుతోందని సూచిస్తున్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa