ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 15 నుంచి తిరుమలలో కొత్త రూల్స్: భక్తులకు ముఖ్య సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 08:29 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్‌(FASTag) ఉండడం తప్పనిసరి అని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసినట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇకపై ఫాస్టాగ్‌ లేని వాహనాలను కొండపైకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్‌ జారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఫాస్టాగ్‌ లేని వాహనదారులు ఇక్కడ తక్కువ సమయంలోనే ఫాస్టాగ్‌ సౌకర్యాన్ని పొందిన తర్వాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa