ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టు ఎంపికకు సంబంధించిన చర్చలు వేగవంతం చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీకి సిద్ధమవుతున్న భారత్, సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేయాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జపాన్ పర్యటనకు వెళ్లినట్లు వార్తలు వెలువడడం, అభిమానుల మధ్య కొంత గందరగోళాన్ని కలిగించింది. ఆసియా కప్ తలుపుతడుతున్న తరుణంలో కెప్టెన్ దేశం వెలుపల ఉండటం విమర్శలకూ, సందేహాలకూ దారితీస్తోంది.
తాజాగా హెర్నియా సర్జరీ చేసిన సూర్యకుమార్ ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాడు. కొన్ని వారాలుగా విశ్రాంతిలో ఉన్న అతను, ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ తిరిగి ప్రారంభించాడు. ఫిట్నెస్లోకి పూర్తిగా వచ్చేందుకు మరికొంత సమయం అవసరమవుతుందన్న అభిప్రాయం ఉంది.
ఈ నేపథ్యంలో అతని జపాన్ పర్యటనపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అతను ఆసియా కప్కు అందుబాటులో ఉంటాడా? లేక విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతో ప్రయాణించాడా? అన్నది త్వరలో స్పష్టతకు వచ్చే అవకాశముంది. సెలెక్షన్ కమిటీ నిర్ణయం, సూర్యకుమార్ ఆరోగ్యంపై నివేదిక ఆధారంగా ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa