ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ వైద్యులకి హెచ్చరికలు జారీచేసిన మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 01:01 PM

ఆర్‌ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు అత్యవసర ప్రథమ చికిత్సలకే పరిమితం కావాలని.. పరిధి దాటి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీ శ్రీహరిరావు హెచ్చరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే విజయలక్ష్మీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గార్లపాటి నందకిశోర్‌, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ విజిలెన్స్‌ అధికారి డాక్టర్‌ ఆశాకిరణ్‌తో కలసి శుక్రవారం ఆయన తురకపాలెంలో పర్యటించారు. గ్రామంలోని ఆర్‌ఎంపీ క్లినిక్‌లను సందర్శించారు.  తురకపాలెంలో ఆర్‌ఎంపీ క్లినిక్‌లను సందర్శించిన డాక్టర్‌ శ్రీహరిరావు వారు రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. పలు క్లినిక్‌ల్లో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన స్టెరాయిడ్‌, యాంటీబయాటిక్స్‌ ఉండటాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ డాక్టర్‌ శ్రీహరిరావు విలేకరులతో మాట్లాడుతూ... తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలా మంది ఈ ప్రఽథమ చికిత్స కేంద్రంలో సెలైన్లు, యాంటీబయాటిక్స్‌ విచక్షణారహితంగా వాడినట్టు చెప్పారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు సెలైన్లు పెట్టడం, యాంటీబయాటిక్‌ మందులు రాయడం, స్టెరాయిడ్లు ఇవ్వడం ప్రజారోగ్యానికి ఎంతో హానికరమన్నారు. నకిలీ వైద్యులు నిర్వహించే ప్రథమ చికిత్స కేంద్రాలకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa