ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరుగుతున్న ఆకతాయిలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 12:59 PM

తిరుమల కొండకు వస్తున్నవారిలో కొంతమంది అక్కడే ఏవో పనులు చూసుకుంటున్నారు. సొంతూర్లలో అప్పులైపోయినా, ఏదైనా గొడవలైనా భక్తుల్లో కలిసిపోయి జీవించడానికి తిరుమల అనువుగా మారిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచీ చాలా మంది తిరుమల కొండెక్కేస్తున్నారు. ఎక్కినవారు తిరిగి దిగడం లేదు. హాకర్లుగా కొంతమంది, భవన కార్మికులుగా మరికొంతమంది కొండను అడ్డాగా మార్చుకున్నారు. వీరిలో కొంతమంది తరచూ ఆలయ నిబంధనలను భంగపరుస్తున్నారు. మాంసం తీసుకుంటూ, మద్యం తాగుతూ కొందరు హడావుడి చేస్తే, గంజాయి మత్తులో మరికొందరు వీరంగం సృష్టిస్తున్నారు. తిరుమలలోని షెడ్లు, యాత్రికుల వసతి సముదాయాలు వీరి అడ్డాలు. రూపాయి ఖర్చు లేకుండా టీటీడీ ఉచితంగా అందజేసే అన్నప్రసాదాలను తింటూ వీరిలో చాలామంది కాలక్షేపం చేస్తుంటే, కొందరు మాత్రం ఆకతాయి చేష్టలతో భక్తులకు తలనొప్పిగా మారారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa