ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ప్రభావం – రేపు పిడుగులతో వర్షాలకు అవకాశం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్పపీడనానికి అనుబంధంగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోందని చెప్పారు.వాతావరణ ప్రభావం ఎలా ఉండబోతోందంటే..ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రేపు (ఆదివారం, 14-09-2025) ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.తీరప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని చెప్పారు.
*ప్రజలకు సూచనలు:
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు పాటించాలి
అర్ధరాత్రి నుండి తెల్లవారే వరకు పయనాలు చేయకపోవడం మంచిది
*భారీ వర్షాలైన ప్రాంతాలు (శనివారం సాయంత్రం 5 గంటల వరకు):
ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది:
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి – 87.2 మిమీ
ఏలూరు జిల్లా లింగపాలెం – 87.2 మిమీ
గుంటూరు జిల్లా పెదకాకాని – 77.2 మిమీ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి – 75 మిమీ
గుంటూరు జిల్లా వల్లభపురం – 74 మిమీ
గుంటూరు నగరం – 72.2 మిమీ
నూజివీడు – 71 మిమీ
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు – 70.7 మిమీ
కౌతవరం – 70.2 మిమీ
ప్రకాశం జిల్లా దర్శి – 68.5 మిమీ
ఇవి కాకుండా మరో 47 ప్రాంతాల్లో 40 మిమీకి పైగా వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
* రేపు వర్షాలు పడే అవకాశమున్న జిల్లాలు:
శ్రీకాకుళం
తూర్పు గోదావరి
కోనసీమ
పశ్చిమ గోదావరి
ఏలూరు
కృష్ణా
గుంటూరు
బాపట్ల
కర్నూలు
నంద్యాల
ఇవన్నీ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్న జిల్లాలు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa