ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమలోని శంకరగుప్తం ప్రాంతంలో సముద్రపు నీటి ప్రవాహానికి గురై దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించనున్నట్లు ప్రకటించారు. సముద్రపు పోటు సమయంలో వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ద్వారా ఉప్పు నీరు తోటల్లోకి చేరడంతో వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు దెబ్బతిన్న సంఘటన తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం వంటి 13 గ్రామాల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. "రైతుల ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. దసరా తర్వాత స్వయంగా ఈ ప్రాంతాలను రైతులతో కలిసి పరిశీలిస్తాను. తోటల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుంటాను" అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa