బిహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఈ వారం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. దీంతో పోలింగ్ షెడ్యూల్ ప్రకటించే అధికార ప్రకటనకి కౌంట్డౌన్ మొదలవుతోంది.అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో ఉంటారు. వారు చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు ఇతర అధికారులతో సమావేశాలు జరుపుతారు.ఎన్నికల కమిషన్ నవంబర్ 22వ తేదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 5వ తేదీ తర్వాత ఎప్పుడు అయినా ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించవచ్చు. ఎన్నికల శాఖ సమాచారం ప్రకారం, ఈసీ నియమించిన పోలీస్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు అక్టోబర్ 3న ఢిల్లీలో సమావేశమవుతారు.బిహార్లో Special Intensive Revision (SIR) అయిన ఓటర్ల జాబితా పూర్తి కావడం తరువాతే ఈసీ పర్యటన జరుగుతుంది. ఓటర్ల ముసాయిదా జాబితాలో మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ, వివిధ కారణాల వలన 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించడానికి సెప్టెంబర్ 1వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఆ గడువు ముగిసిన వెంటనే తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa