ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిచా ఘోష్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌.. సౌతాఫ్రికా టార్గెట్‌ 252

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 08:15 PM

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తలపడుతున్న టీమ్‌ఇండియా, టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసి 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్‌ 94 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయగా, ప్రతీకా రావల్‌ 37, స్నేహ్‌ రాణా 33 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రైయన్ 3 వికెట్లు తీయగా, మారిజెన్ కాప్, మ్లాబా, డీక్లార్క్‌ 2 చొప్పున, తుమీ సెఖుఖునే 1 వికెట్ సాధించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మలు నిరాశపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa