భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వన్డే ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 5,000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్లో ఆదివారం ఆమె ఈ అరుదైన ఘనతను సాధించింది.ఈ మ్యాచ్కు ముందు 5 వేల పరుగుల మార్కుకు చేరువలో ఉన్న మంధన, తన 112వ వన్డే ఇన్నింగ్స్లో ఈ రికార్డును అందుకుంది. నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ కిమ్ గార్త్ వేసిన 21వ ఓవర్లో అద్భుతమైన సిక్సర్ బాది ఆమె ఈ మైలురాయిని పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో, వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. టేలర్ 129 మ్యాచ్లలో ఈ ఘనత సాధించగా, మంధన కేవలం 112 మ్యాచ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ జాబితాలో సుజీ బేట్స్ (136), మిథాలీ రాజ్ (144), చార్లెట్ ఎడ్వర్డ్స్ (156) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన మంధన, కేవలం 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి సోఫీ మోలినెక్స్ బౌలింగ్లో అవుటైంది. ఈ ప్రపంచకప్లో తొలి మూడు మ్యాచ్లలో కేవలం 54 పరుగులే చేసి నిరాశపరిచినప్పటికీ, ఈ ఇన్నింగ్స్తో ఆమె తిరిగి ఫామ్లోకి వచ్చింది. ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికే 974 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా నిలిచిన మంధన, ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కూడా రెండు సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa