ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్వథ్వీ షా సహా నలుగురు టాప్ బ్యాటర్స్ డక్.. రీ ఎంట్రీలో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్

sports |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 10:53 PM

మోచేతి గాయం కారణంగా దాదాపు 5 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న యువ ఆటగాడు రుతురాత్ గైక్వాడ్.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న గైక్వాడ్.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులో నిల్చొని.. గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 91 పరుగులు చేసి మహారాష్ట్రను ఆదుకున్నాడు.


గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ తడిగా, బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో.. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తాము తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని తెలిసేందుకు కేరళకు ఎంతో సమయం పట్టలేదు. ఆ జట్టు బౌలర్ ఎండీ నిధీష్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఇటీవల ముంబై నుంచి మహారాష్ట్ర జట్టుకు మారిన పృథ్వీ షాను ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికే డకౌట్ చేశాడు. తర్వాతి బంతికే సిద్ధేష్ వీర్‌ను (0) కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే అర్షిన్ కులకర్ణిని (0) బాసిల్ అవుట్ చేశాడు.


వెంటనే అంకిత్ బావ్నే (0) కూడా డకౌట్ అయ్యాడు. ఇలా టాప్-5 లో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 18 రన్స్ వద్ద సౌరభ్ నవాలే (12) కూడా అవుట్ అయ్యాడు. ఇక జట్టు స్కోరు 0/2 తో ఉన్నప్పుడే క్రీజులోకి వచ్చాడు రుతురాజ్ గైక్వాడ్ . కేరళ బౌలర్లు సీమ్, స్వింగ్ బౌలింగ్‌తో అటాక్ చేసినప్పటికీ.. చాలా నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు గైక్వాడ్. తనదైన రెడ్ బాల్ టెక్నిక్‌తో.. సాఫ్ట్ హ్యాండ్స్‌తో బ్యాటింగ్ చేశాడు. చక్కటి కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు.


మరో ఎండ్‌లో జలజ్ సక్సేనా (49) నుంచి మంచి సహకారం లభించగా.. ఆరో వికెట్‌కు గైక్వాడ్- సక్సేనా కలిసి 122 పరుగులు జోడించారు. ఈ కీలక భాగస్వామ్యంతో కేరళ బౌలర్ల ఆధిపత్యానికి గండి పడింది. ఇక సక్సేనా ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరగా.. ఏడో వికెట్‌కు విక్కీ ఓస్వ్తాల్‌తో కలిసి 24 రన్స్ చేసిన గైక్వాడ్.. మొత్తం 91 పరుగులు చేసి ఈడెన్ యాపిల్‌ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర 179-7 తో నిలిచింది.


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన గైక్వాడ్.. గాయం కారణంగా లీగ్ మధ్యలోనే వైదొలిగాడు. తర్వాత ఇండియా- ఏ టూర్, యార్క్‌షైర్ కౌంటీ మ్యాచ్‌లకు కూడా దూరమైన 28 ఏళ్ల ఈ ఆటగాడు.. తన విరామాన్ని రెడ్ బాల్ క్రికెట్‌ను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకున్నాడు.సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔటయినా.. అతని ఇన్నింగ్స్ శతకం కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. మహారాష్ట్ర టాప్ ఆర్డర్‌ను కూల్చిన నిధీష్ కూడా రుతురాజ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. దీంతో రంజీ సీజన్ మొదటి రోజే.. రుతురాజ్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa