భారత్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం గాయపడ్డాడు. ఈ విషయం ఎక్స్ రేలో తేలింది. ఇక త్వరలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా.. గ్రీన్కు విశ్రాంతి ఇవ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ భావిస్తోంది. అతడి ప్లేసులో మార్నస్ లబుషేన్ను జట్టులోకి తీసుకుంది.
తొలుత ప్రకటించిన వన్డే జట్టులో లబుషేన్కు చోటు దక్క లేదు. అంతర్జాతీయ క్రికెట్లో పేలవ ఫామ్ కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించారు. కానీ అతడు.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అద్భుత ఫామ్లో ఉన్నాడు. అయిదు ఇన్నింగ్స్లో నాలుగు సెంచరీలు కొట్టాడు. దీంతో కామెరూన్ గ్రీన్ ప్లేసులో ఆస్ట్రేలియా వన్డే జట్టులోకి వచ్చాడు లబుషేన్. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది.
భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, మార్నస్ లబుషేన్ , మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, కూపర్ కన్నోలి, జేవియర్ బార్ట్ లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, ఆడమ్ జంపా, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిష్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్
ఆస్ట్రేలియా- భారత్ మ్యాచ్ల షెడ్యూల్..
వన్డే సిరీస్..
తొలి వన్డే: అక్టోబర్ 19 - పెర్త్ స్టేడియం
రెండో వన్డే: అక్టోబర్ 23 - అడిలైడ్ ఓవల్
మూడో వన్డే: అక్టోబర్ 25 - సిడ్నీ క్రికెట్ స్టేడియం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa