ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సుమారు ఏడు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్లో వారి ప్రదర్శన ఆధారంగానే వారి ఫ్యూచర్ డిసైడ్ కానుందనే ప్రచారం ఉంది. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలని ఈ ఇద్దరు ప్లేయర్లు భావిస్తున్నారు. కానీ అది జరగాలంటే మాత్రం వారు ఫిట్నెస్తో పాటు ఫామ్లో కూడా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. వన్డే ప్రపంచకప్ 2027కు ఇంకా చాలా సమయం ఉందని.. అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఓ కార్యక్రమంలో అతడు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
"ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. మేం ఎప్పుడైనా జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాం. వన్డే ప్రపంచకప్ 2025కి ఇంకా రెండేళ్ల టైమ్ ఉంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరం. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం కదా. నేను చెప్పేది కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాత్రమే కాదు. జట్టులోని యువ ఆటగాళ్లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది" అని అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు.
"రోహిత్, కోహ్లీ ఇప్పుడేమీ అండర్ ట్రయల్స్లో లేరు. వారు ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు. ఏడు నెలల తర్వాత భారత జెర్సీ ధరించి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. ఒక్క సిరీస్లో విఫలమైనంత మాత్రాన.. వారిని పక్కన పెట్టే అవకాశం ఉండదు. ఒకవేళ భారీగా రన్స్ చేసినా కూడా ఇప్పుడే.. వరల్డ్ కప్లో చోటు గురించి ఆలోచించేది కూడా ఉండదు. ఎందుకంటే ఈ విషయంలో మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి" అని టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa