ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3.5 తీవ్రతతో నేపాల్‌ను వణికించిన భూకంపం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 02:16 PM

నేపాల్‌ను మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నివేదికలు తెలుపుతున్నాయి. నేపాల్‌లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి, 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa