జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా అశాస్త్రీయంగా విభజించిందని, ఇప్పుడు ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం దృష్ట్యా కొత్తగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం ప్రజల సూచనలు, ఫిర్యాదులను సేకరించి చర్చించింది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa