ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్తఫాబాద్ గ్రామానికి 'కబీర్ ధామ్'‌గా పేరు మార్చిన యోగి

national |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 04:00 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును 'కబీర్ ధామ్'‌గా మార్చనున్నట్లు సోమవారం వెల్లడించారు. లఖింపూర్ ఖేరిలోని విశ్వ కళ్యాణ్ ఆశ్రమంలో జరిగిన 'స్మృతి ప్రకటోత్సవ మేళా'లో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఇక్కడికి వచ్చాక ఈ గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తెలిసింది. ఇక్కడ ముస్లిం జనాభా ఎంత అని అడిగినప్పుడు, ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదని చెప్పారు. అందుకే ఈ గ్రామం పేరును 'కబీర్ ధామ్'గా మారుస్తామని నేను హామీ ఇచ్చాను" అని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పేరు మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa