ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.17.5 లక్షల నగదు దొరికిన, నిజాయతి చూపించిన మహిళ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 03:58 PM

గుడిలో దేవుడిని దర్శించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఓ మహిళకు రోడ్డుపై నోట్ల కట్టలతో ఉన్న బ్యాగు దొరికింది. బ్యాగు లోపల అన్నీ నోట్ల కట్టలే.. అదీ రూ.500 నోట్లే కనిపించాయి. ఇంకొకరైతే దేవుడే తనకీ అదృష్టం కల్పించాడని ఆ బ్యాగును ఇంటికి తీసుకెళ్లేవారే.. కానీ సెల్వమాలిని మాత్రం ఆ బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. ఆమె ముందే బ్యాగును తెరిచి నోట్ల కట్టలను లెక్కించిన పోలీసులు మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగులోని నోట్ల కట్టలను చూసి కూడా చలించకుండా తీసుకొచ్చి తమకు అప్పగించిన సెల్వమాలిని నిజాయతీని పోలీసులు అభినందించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై సిమ్మక్కల్‌ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సెల్వమాలిని ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై ఓ సంచీ కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న ఆ సంచీని పక్కన పడేయాలనే ఉద్దేశంతో సెల్వమాలిని దగ్గరకు వెళ్లగా.. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో సమీపంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచీని తీసుకెళ్లి అప్పగించింది. కాగా, ఆ నోట్ల కట్టల బ్యాగు ఎవరిది.. అక్కడ ఎందుకు ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa