విశాఖపట్నంలో సైబర్ నేరస్తుల దందా మళ్లీ బయటపడింది. Greater Visakhapatnam Municipal Corporation కమిషనర్ వాట్సాప్ నంబర్ హ్యాక్ చేసి, ఆయన పేరుతో ఇతరులకు సందేశాలు పంపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.కమిషనర్ ఫొటోను ఉపయోగిస్తూ, అత్యవసరం అంటూ డబ్బులు పంపాలని కోరుతూ మోసపూరిత మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ వెంటనే స్పందించి అప్రమత్తమయ్యారు. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, అలాంటి మెసేజ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని స్పష్టం చేశారుఅధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా డబ్బులు అడిగే అనుమానాస్పద మెసేజ్లపై స్పందించే ముందు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారుఈ ఘటనపై కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఈ సైబర్ మోసానికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు అనే అంశాలపై విచారణ చేపట్టారు.ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa