ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ గేదె విలువ రూ.23 కోట్లు.. గుర్రం రూ.15 కోట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:08 PM

ఆసియాలోనే అతిపెద్ద పశువుల జాతర... పుష్కర్ 2025 మొదలయ్యింది. అక్టోబర్ 23న ప్రారంభమైన ఈ జాతర నవంబర్ 7 వరకు కొసాగుతుంది. ఈ సంవత్సరం పుష్కర్‌లో భారీ సంఖ్యలో జంతువులు పాల్గొన్నాయి. ఇప్పటి వరకు మూడు వేలకు పైగా జంతువులు ఇక్కడకు తరలి వచ్చాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద పశువుల జాతరగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సారి పుష్కర్‌లో ఓ గేదె, గుర్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


ప్రతి సంవత్సరం పుష్కర్ పేరిట నిర్వహించే ఈ జాతర అజ్మీర్‌లో జరుగుతుంది. ఈ సంతలో మార్వారీ జాతి గుర్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి పంజాబ్, హర్యానా నుండి వచ్చిన కొన్ని గుర్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటి ధరలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన జంతువుల్లో 15 కోట్ల రూపాయల విలువైన గుర్రం, 23 కోట్ల రూపాయల విలువైన గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ విదేశాల నుంచి వ్యాపారులు, పర్యాటకులు, ఆసక్తిగల సందర్శకులు వీటిని చూసేందుకు తరలివస్తున్నారు.


అజ్మీర్ పుష్కర్ పశువుల సంత ఘనంగా నిర్వహిస్తారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి పలువురు గుర్రాల పెంపకందారులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రమోద్ పరాశర్ అనే వ్యక్తి బ్రహ్మదేవ్ అనే మార్వారీ గుర్రాన్ని పెంచుతున్నాడు. దానిని ఈ సారి ఈ ఉత్సవానికి తీసుకుని వచ్చాడు. బ్రహ్మదేవ్ తండ్రి డానా అనే గుర్రం గతంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది. ప్రస్తుతం ఈ గుర్రం భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని వద్ద ఉంది.


బికనీర్ కు చెందిన ఒక పశువుల యజమాని 800 కిలోల బరువున్న ముర్రా జాతి గేదెను పుష్కర్ వేడుకలకు తీసుకువచ్చాడు. ఆ గేదె విలువ దాదాపు రూ.10 లక్షలు. అలాగే, బాదల్ అనే ఐదేళ్ల గుర్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాదల్ ఇప్పటికే 285 ఫోల్స్ కు తండ్రి.. దాని విలువ 11 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఈ గుర్రం యజమాని రాహుల్‌కి దానిని అమ్మే ఉద్దేశం లేనట్టు సమాచారం.


షాహ్‌బాజ్ విలువ రూ.15 కోట్లు


చండీగఢ్ నుంచి వచ్చిన షాబాజ్ అనే రెండున్నర సంవత్సరాల గుర్రం ధర 15 కోట్ల రూపాయలు. దీని యజమాని గ్యారీ గిల్. ఈ గుర్రం ఈసారి మేళాలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. షాహ్‌బాజ్ ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలలో గెలిచిందని దాని యజమాని తెలిపారు. దీని కవరింగ్ ఫీజు 2 లక్షల రూపాయలు, దీని ధర 15 కోట్ల రూపాయలు. ఇప్పటికే 9 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు వచ్చాయి అన్నారు. ఈ గుర్రం బ్రీడింగ్ ఖర్చు మాత్రమే 2 లక్షల రూపాయలు. ఈ అరుదైన మార్వారీ జాతి గుర్రాన్ని చూసేందుకు సందర్శకులు బారులు తీరుతున్నారు.


అన్‌మోల్ రూ.23 కోట్ల రూపాయల గేదె


రాజస్థాన్‌కు చెందిన అన్మోల్ అనే గేదె అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీని యజమాని చెప్పిన దాని ప్రకారం ఈ గేదె విలువ 23 కోట్ల రూపాయలు. దీనికి ప్రతిరోజూ పాలు, దేశీ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారం పెడుతున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa