వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఈ టోర్నీ జరగనుంది. అయితే ఈ మెగా ఈవెంట్కు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత హర్షా భోగ్లే స్పందించాడు. టీ20 ప్రపంచకప్ 2026 కోసం తన జట్టును ప్రకటించాడు.
హర్షా భోగ్లే.. ఈ ఈవెంట్ కోసం మొత్తంగా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశాడు. అయితే ఇందులో యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్కు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం టీ20 జట్టులోని ఆటగాళ్లవైపే హర్ష భోగ్లే మొగ్గు చూపాడు. ఈ జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ కోటాలో ఇద్దరికి చోటు కల్పించాడు. ఇద్దరు పేసర్లకు చోటు కల్పించాడు. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం హర్ష ఎంపిక చేసిన భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
కాగా టీ20 ప్రపంచకప్ 2026.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆరంభ మ్యాచ్తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. వాంఖడే స్టేడియంలో ఒక సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఒక వేళ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే.. అది శ్రీలంకలో నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa