ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కదిరిలోని ఆలయంలో జరిగిన దొంగతనంపై స్పందించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 03:56 PM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆస్తులను సంరక్షించాల్సిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)యే భక్షకుడిగా మారి, గుడిలోని అమ్మవారి సొమ్మును దోచుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వివరాల్లోకి వెళితే, కదిరి రూరల్ మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న మురళీకృష్ణ, గుడిలోని సుమారు 5 కిలోల వెండి ఆభరణాలు, పట్టుచీరలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మురళీకృష్ణపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈవో మురళీకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాల్లో ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa