ఇండిగో ఎయిర్లైన్స్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. గత సంక్షోభం తర్వాత, విమాన సేవలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే వెబ్సైట్లో షెడ్యూల్ను అప్డేట్ చేసి, అన్ని విమానాలు క్రమంగా నడుస్తున్నాయని తెలిపింది. విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల లగేజీని అందజేసి, మిగతా లగేజీ డెలివరీకి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంగళవారం 1800 విమానాలు, బుధవారం 1900 విమానాలు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసారని ఇండిగో పేర్కొంది. అలాగే, ఆన్టైమ్ పనితీరు సాధారణ స్థాయికి చేరినట్లు తెలిపారు.ప్రయాణికుల కోసం పూర్తి రీఫండ్ ప్రక్రియను సంస్థ ఆటోమేటెడ్ విధానంలో మార్చి, వెబ్సైట్ ద్వారా సులభంగా పొందేలా చేసింది. ఇండిగో, ప్రయాణం ప్రారంభించే ముందు వెబ్సైట్లో విమాన సమాచారం తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేసింది.సీఈవో పీటర్ ఎల్బర్స్ వీడియో ప్రకటనలో, సంక్షోభం తర్వాత సంస్థ మళ్లీ పటిష్టంగా నిలబడిందని తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు చెప్పిన ఆయన, విమాన ప్రయాణం ప్రజల భావోద్వేగాలు, ఆశయాలను కలుపుతుందని పేర్కొన్నారు. ఆయన వెల్లడించినట్లుగా, వేలాది మంది తమ ప్రయాణాలను కొనసాగించలేకపోయారు, అందుకు హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. విమానాలను రద్దు చేయలేకపోవడం బాధాకరమైన అంశమని, ఇండిగో బృందం కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు.ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తేనే ప్రధాన ప్రాధాన్యత అని ఎల్బర్స్ అన్నారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రీఫండ్లు జారీ అవుతున్నాయని, చిక్కుల్లో ఉన్న లగేజీని త్వరలో డెలివరీ చేస్తామని వెల్లడించారు. కంపెనీ, కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉందని, సమస్యల నుంచి పాఠాలు నేర్చుకున్నామని తెలిపారు. పరిస్థితి తలెత్తిన కారణాలను విశ్లేషిస్తున్నామని, ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. చివరగా, కష్టసమయంలో సహకరించిన, మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa