ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా పాలనలో విశాఖపై విషం చిమ్మిన ఎల్లోమీడియా, ఇప్పుడు విశాఖ బంగారమంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 11:40 AM

పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లోమీడియా రాతలు రాయడం అన్యాయం, దుర్మార్గమని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు. గతంలో విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటం వల్ల తీవ్రవాద దాడులకు టార్గెట్, విదేశీ దాడులకు సాఫ్ట్‌ టార్గెట్‌ అని రాశారని, విశాఖ భూకంపాల జోన్‌ లో ఉంది, హైరిస్క్‌ ఏరియా అని రాశారని, గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోయి విశాఖ మునిగిపోతుంది, కాబట్టి రాజధానిగా చేయొద్దంటూ రాతలు రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖపట్నం అద్బుతం, ఇక్కడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, బంగారం పండుతుంది, సిలికాన్‌ లభిస్తుంది, కాబట్టి ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, చంద్రబాబు విజన్‌ వల్లే విశాఖ ఇలా మారిపోతుందని రాస్తున్నారని శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa