ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 01:35 PM

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ రోజు తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి వైకుంఠద్వార దర్శనాల ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు.డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల వైకుంఠద్వార దర్శనాలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మొత్తం 164 గంటల పాటు వైకుంఠద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.మిగిలిన ఏడు రోజుల పాటు ఎలాంటి టోకెన్లు లేకుండానే భక్తులకు వైకుంఠద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలకు భారీగా తరలి వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాద వితరణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa