ఎమ్మిగనూరులో 104 ఉద్యోగులు తమ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రం అందజేశారు. డిసెంబర్ 4న జీవో నెంబరు 706 ద్వారా 12.56 కోట్ల రూపాయలు విడుదల చేసినా, నేటి వరకు తమకు వేతనాలు అందలేదని, దీనివల్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఉద్యోగులు తెలిపారు. మంత్రి భరత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఇలియాస్, హాసన్ షరీఫ్, అజాద్, 104 ఉద్యోగులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa