ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10,000 పరుగుల మైలురాయిని అందుకున్న స్మృతి మంధాన

sports |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:41 AM

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ ఘనతను భారత క్రీడాకారిణుల్లో మిథాలీ రాజ్ మాత్రమే సాధించింది.ఆదివారం నాడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో స్మృతి ఈ రికార్డును నెలకొల్పింది. మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 27 పరుగుల దూరంలో ఉన్న ఆమె, కేవలం 20 బంతుల్లోనే ఈ మైలురాయిని దాటింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మొత్తం 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది.ఈ ఘనతతో స్మృతి.. మిథాలీ రాజ్, న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ సరసన చేరింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ (10,868) రికార్డును అధిగమించే అవకాశం స్మృతికి ఉంది. ఇటీవల శ్రీలంక సిరీస్‌లోనే 4,000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గానూ స్మృతి నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa