ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటూ బలవన్మరణానికి పాల్పడిన యువకుడు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 01:32 PM

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తాను చనిపోయే ముందు వాట్సాప్‌లో ఉంచిన సందేశం ఇప్పుడు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చకు తెరలేపింది. సోరబ్ తాలూకా కైసోడి గ్రామానికి చెందిన రాకేష్ (21) తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన రాకేష్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.రాకేష్ తన సూసైడ్ నోట్‌లో కన్నడ సూపర్ స్టార్ యష్ జీవితానుభవాలను ప్రస్తావించాడు. ‘వీకెండ్ విత్ రమేశ్’ టీవీ కార్యక్రమంలో యష్ పంచుకున్న తన జీవిత ప్రయాణం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, అటువంటి నిజ జీవిత గాథలను పాఠశాల సిలబస్‌లో చేర్చాలని కోరాడు. దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక పాఠాలు నేర్చుకుంటారని తన సందేశంలో పేర్కొన్నాడు.పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మితిమీరిన ఒత్తిడి తీసుకురావొద్దని రాకేష్ విజ్ఞప్తి చేశాడు. "ద్రోణాచార్యుడు అర్జునుడిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినట్లుగా.. నేటి విద్యా వ్యవస్థ కూడా పిల్లల అభిరుచులను గుర్తించాలి" అని కోరాడు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చదవడం కాకుండా, విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో రాణించేలా సమాజం వారిని ప్రోత్సహించాలని సూచించాడు.ఇంటర్నెట్‌లో లభించే 'మెంటల్ గైడెన్స్' కంటెంట్ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి మానసిక మద్దతుకు సంబంధించిన అసహజ కంటెంట్‌ను తొలగించాలని కోరాడు. ఈ ఘటనపై సోరబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa