తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెలు సంబరాలతో కళకళలాడుతున్నాయి. ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, పడవల పోటీలు, క్రికెట్, వాలీబాల్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ పండుగ సమయంలో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో సహా ప్రధాన నగరాల్లో కిలో చికెన్ ధర రూ.350కి చేరింది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో అయితే అదనంగా రూ.20 పెరిగి, రూ.370కి అమ్ముతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కిలో చికెన్ ధర రూ.400 వరకు చేరవచ్చని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa