లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జైల్లో ఉండగానే ఆయనకు స్వల్ప అనారోగ్యం తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు తరలించారు. ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డికి వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా స్వల్ప అస్వస్థత కారణంగానే ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయ్యాక తిరిగి జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa