ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభకు అజిత్‌ పవార్‌ కుమారుడు?

national |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 11:40 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఆయన భార్య సునేత్ర పవార్ ఆ పదవిని చేపట్టే అవకాశాలున్నాయని, దీంతో ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుందని, ఆ స్థానానికి కుమారుడు పార్థ్ పవార్‌ను పంపించే అవకాశం ఉందని ఎన్సీపీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్‌  ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని పార్థ్‌ భర్తీ చేయనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. పార్థ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇదిలాఉండగా.. ముంబయిలో నేడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఇందులో సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa